
జన నినాదం, తిర్యాణి 05
ఆయన ఆదివాసుడు.. చదువుకోని అమాయకుడే అయినా.. తనలోనూ మానవత్వం పరిమళిస్తుందని చాటుకున్నాడు. విలువైన మొబైల్ ఫోన్ దొరికితే పలాయనం చిత్తగించకుండా.. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అందించి అందరినీ అబ్బుర పరిచాడు. ఆయనెవరో కాదు.. మంగి గ్రామ పంచాయతీ పరిధిలోని పాతగూడేనికి చెందిన మంగం కాంతారావు. దాదాపు నాలుగు రోజుల క్రితం మంచిర్యాల చెందిన గాయత్రి అనే వ్యక్తి తన విలువైన ఐ మొబైల్ ఫోన్ తిర్యాణి లో పోగొట్టుకున్నాడు. అయితే అదే ఫోన్ బుధవారం కాంతారావుకు తిర్యాణిలో దొరకింది. దీంతో ఫోన్ తో సహా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి దానిని పోలీసులకు అప్పగించాడు. తన నిజాయితీని చాటుకున్నాడు. ఇంత నిజాయితీగా ఫోన్ తిరిగి ఇచ్చినందుకు ఎస్సై శ్రీకాంత్ తో పాటు పలువురు కాంతారావును అభినందనలు తెలిపారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.