
జన నినాదం, తిర్యాణి 03
మండలంలోని కన్నెపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవని మహిళా ఉపాధ్యాయులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ
సమాజంలో అణిచివేతకు గురైన వారికి న్యాయం అందించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, విద్య పట్ల, లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమని, మహిళల విద్యా కోసం ఎంతో కృషి చేశారని, విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అనూష, మాధురి, నగేష్, ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.